పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.. తహసీల్దార్కు వినతి
విద్యార్థుల భవిష్యత్తు కోసం మూడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో పనిచేసిన ఒకేషనల్ ఉపాధ్యాయురాలు మద్దినేని పార్వతి రమేష్ శనివారం పదవీ విరమణ పొందారు. కోటగిరి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆమె విడ్కోలు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం: పార్వతి ఇదే పాఠశాలలో సుమారు 33 ఏళ్ల పాటు ఒకేషనల్ ఉపాధ్యాయురాలిగా సేవలందించి, వందలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఒకే పాఠశాలలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ చేయడం విశేషం. కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు తాటి వీరేశం తరఫున సొసైటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. పార్వతి గారి సేవలు చిరస్మరణీయమని, ఆమె విశ్రాంత జీవనం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, పోల విటల్ సెట్, రాజేశ్వర్ పటేల్, మాజీ ఎంఆర్ఓ సాయిలు, టెలిఫోన్ గంగారం, సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్ గంగాధర్ మరియు కిడ్స్ సొసైటీ సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

