సుంకినిలో మన ఇసుక వాహనం ప్రారంభం : తహసీల్దార్ గంగాధర్
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామంలోని మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో మన ఇసుక వాహనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ గంగాధర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు వినియోగదారులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇసుక అవసరమున్న మన ఇసుక వాహనం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాసి పటేల్, ఏఎంసి చైర్మన్ హనుమంతు, గ్రామ సెక్రటరీ, సర్వేయర్లు, జీపీ సిబ్బంది, ట్రాక్టర్ యజమానులు, వర్ని కార్తిక చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Views: 15
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

