భీమ్గల్లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
By R.Suresh
On
భీమ్గల్ పురపాలక కార్యాలయంలో శనివారం 28 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, కౌన్సిలర్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అందించే కల్యాణ లక్ష్మి చెక్కులు అత్యంత వేగంగా మంజూరవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ సంటి లత నరయ్య, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్లు సందీప్, తోట సతీష్, అంజుమ్, సంగ్య నాయక్, పర్స కుశలత అనంతరావు, నీలం రవి, బోదిరే లావణ్య నరయ్యలతో పాటు మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 9
Tags:
About The Author
Latest News
01 Mar 2026 15:53:05
బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త):
లయన్స్ క్లబ్ అఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బీర్కూర్లోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించిన మహత్తర రక్తదాన శిబిరం ఘనవిజయం సాధించింది. సమాజ...

