ఘనంగా బీర్కూర్లో పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు – జై పీబిఆర్ నినాదాలతో మార్మోగిన బీర్కూర్
బాన్సువాడ, జూలై 23(డిడి9 వార్త):
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీర్కూర్ మండల కేంద్రంలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేసి పూలమాలలు సమర్పించారు.పోచారం భాస్కర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడిగా ఆయన మరింతకాలం సేవలందించాలని ఆకాంక్షించారు.అనంతరం గాంధీ చౌక్లో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు జై పీబిఆర్ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్ యూత్ ఐకాన్ మియాపురం శశికాంత్, మాజీ ఎంపీపీ రఘు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాములు, ఉప సర్పంచ్ పరమేష్, డైరెక్టర్ గోండ్ల రాజు, కొరిమె రఘు, ఆత్మ కమిటీ సభ్యుడు శంకర్, విజయ్, ప్రకాష్, దుంపల రాజు, మన్నన్, మేకల విఠల్, ఆరిఫ్, లడిగం గంగాధర్, కిరణ్, ఇంగురాములు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

