సర్ సర్వేను 100% పూర్తి చేసిన చించొల్లి గ్రామ బీఎల్వో కు అభినందించిన ఆర్డీవో రవీందర్ రెడ్డి.
On
బాన్సువాడ, జూలై 17(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని చించొల్లి గ్రామంలో ప్రత్యేక ఇంటింటి సర్వే (సర్)ను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన గ్రామ బీఎల్వో మంజుల ని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అభినందించారు.విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధతతో పనిచేసి సర్వేను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేసినందుకు మంజులని ప్రశంసించారు.ఇదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఆర్డీవో సూచించారు.ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మంజుల కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె కృషి ఇతర బీఎల్వో లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు.ఈకార్యక్రమంలో తహశీల్దార్ సవాయిసింగ్,బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ,ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఉన్నారు.
Views: 30
Tags:
About The Author
Related Posts
Latest News
17 Jul 2026 15:57:12
బాన్సువాడ, జూలై 17(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామ అంగన్వాడీ కేంద్రానికి చిన్నారుల సౌకర్యార్థం 15 కుర్చీలను బీజేపీ కార్యకర్త పుల్కాటి మల్లేష్ విరాళంగా అందజేశారు.ఈ...

