బీర్కూర్ తహసీల్దార్‌గా సవాయి సింగ్

బీర్కూర్,జనవరి 07(డిడి9 వార్త):

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల తహసీల్దార్‌గా సవాయి సింగ్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు బీర్కూర్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సాయి భుజంగరావును నిజాంసాగర్‌కు బదిలీ చేయగా, అతని స్థానంలో ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సవాయి సింగ్‌ను బీర్కూర్ తహసీల్దార్‌గా నియమించారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సవాయి సింగ్ మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మండల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

Views: 540
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు