బోధన్ పట్టణంలో ముమ్మరంగా దోమల నివారణ చర్యలు
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లాబోధన్ పట్టణంలో దోమల నివారణకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది, ఇందులో భాగంగా శుక్రవారం 16వ వార్డులో మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మ, కౌన్సిలర్ దివ్యతో కలిసి దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణవ్యాప్తంగా ఫాగింగ్, మందు పిచికారీ చేయిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏఈ శ్రీనివాస్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Views: 8
Tags:
About The Author
Latest News
02 May 2026 18:15:19
మహిళా సంఘాలకు రూ. 3.80 కోట్ల కమిషన్ చెక్కు పంపిణీ

