మేనఅల్లుడు చేతిలో మేనత్త హత్య – వెంకటాపురం మండలం కలకలం

మేనఅల్లుడు చేతిలో మేనత్త హత్య – వెంకటాపురం మండలం కలకలం

DD9 వార్త.. 11.09.2025 

మేనఅల్లుడు చేతిలో మేనత్త హత్య – వెంకటాపురం మండలం కలకలం

వెంకటాపురం, సెప్టెంబర్ 11 (DD9 వార్త): ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్‌కే పురం పంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామంలో దారుణ హత్య జరిగింది.

స్థానిక సమాచారం ప్రకారం, కొండ గొర్ల విజయ్ (35), సన్నాఫ్ సమ్మయ్య, తన మేనత్త కొండ గొర్ల ఎల్లక్క (55) ను కత్తితో దాడి చేసి హతమార్చాడు. కుటుంబ తగాదాల కారణంగానే ఈ దారుణం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

హత్య తర్వాత గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మేనఅల్లుడు చేతిలో మేనత్త ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో కలకలం రేపగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Views: 481

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు