జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరును మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ తీవ్ర నిరసన

బాన్సువాడ, డిసెంబర్ 28(డిడి9 వార్త):

వర్ని మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి జాతిపిత మహాత్మ గాంధీ పేరును మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“దేశ స్వాతంత్ర్యానికి ప్రాణప్రతిష్ఠ చేసిన మహానేత మహాత్మ గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధం. ఇది కోట్లాది భారతీయుల మనోభావాలను గాయపరిచే చర్య” అని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 28
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు