కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

బీర్కూర్, ఏప్రిల్ 23(డిడి9 వార్త):

బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (26) అనే యువకుడు గురువారం ఉదయం కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. సమాచారం మేరకు, మహేష్ తాను కిరాయికి ఉంటున్న ఇంటిలో ఏర్పడిన విద్యుత్ సమస్యను స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు.షాక్ తగిలి కిందపడిపోయిన మహేష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రికి చేరుకునే సరికి అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్టు గ్రామస్తులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Views: 282
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు