యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ అరుదైన శిఖరాలను అధిరోహించాడు
On
కామారెడ్డి, నవంబర్ 29(డిడి9 వార్త): తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ పర్వతారోహణ రంగంలో మరో మైలురాయిని అధిగమించాడు. ఆయన ఇటీవల మౌంట్ గోరిచెన్, మౌంట్ రియో పూర్గిల్తో పాటు అస్సాం, మణిపూర్, మిజోరామ్ రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను విజయవంతంగా అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠిన మార్గదర్శకాల మధ్య ఈ శిఖరాలను అధిరోహించడం విశేషంగా నిలిచింది.యశ్వంత్ ఈ యాత్రలో తీసుకున్న అరుదైన ఫోటోలను ఎస్పీ రాజేష్ చంద్రకి అందజేశాడు. ఈ సందర్భంగా ఎస్పీ యశ్వంత్ను అభినందిస్తూ, ఆయన పట్టుదల, ధైర్యసాహసాలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించేందుకు శుభాకాంక్షలు తెలిపారు.
యశ్వంత్ సాధించిన ఈ విజయాలు తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయి.
Views: 15
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

