బీర్కూర్ తండా సర్పంచ్ దేవీసింగ్కు ఘనంగా సన్మానించిన యువజన నాయకుడు మియపురం శశికాంత్
బీర్కూర్,జనవరి 07(డిడి9 వార్త):
బీర్కూర్ తండా సర్పంచ్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దేవీసింగ్ను బీర్కూర్ యువజన నాయకుడు మియపురం శశికాంత్ తన స్వగృహంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న సర్పంచ్ సేవలను గుర్తించి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ
“బీర్కూర్ తండా గ్రామాభివృద్ధికి దేవీసింగ్ అంకితభావంతో పని చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. ఆయన నాయకత్వంలో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.సర్పంచ్ దేవీసింగ్ మాట్లాడుతూ, ఈ సన్మానం తనకు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మియపురం శ్రీకాంత్,శ్యామ్యు,యువజన సంఘ నాయకులు పాల్గొని సర్పంచ్ దేవీసింగ్కు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

