పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం – మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్-సన్ సిటి,సెప్టెంబర్20,(డిడి9 వార్త):
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సన్ సిటీలోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన 3కే రన్ ను రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సతీమణి సరోజన గారు కూడా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడటంలో పిచ్చుకలు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుచేశారు. పిచ్చుకల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం మన సమాజానికి, పర్యావరణానికి ఒక పెద్ద హెచ్చరిక అని పేర్కొన్నారు. ప్రజలంతా చెట్లు నాటి, పక్షులకు ఆహారం, నీరు అందించే అలవాటు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు పాఠశాల స్థాయి నుంచే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో గ్లెండేల్ స్కూల్ నిర్వాహకులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

