హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం

హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి వీరశైవ లింగాయత్ సంఘం తన ఉదారతను చాటుకుంది. శనివారం ఆ సంఘానికి చెందిన రైతులందరూ కలిసి తమ పంట సాగు విస్తీర్ణం ఆధారంగా (ఎకరా చొప్పున) విరాళాలు సేకరించి, మొత్తం రూ. 3,02,850ల  నగదును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మందిర కమిటీ సభ్యులు వీరశైవ లింగాయత్ సంఘం రైతులకు మరియు పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తి భావంతో రైతులందరూ ఏకమై ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాంతీశ్వర్ పటేల్, గాండ్ల విఠల్, నితిన్ పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం