హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి వీరశైవ లింగాయత్ సంఘం తన ఉదారతను చాటుకుంది. శనివారం ఆ సంఘానికి చెందిన రైతులందరూ కలిసి తమ పంట సాగు విస్తీర్ణం ఆధారంగా (ఎకరా చొప్పున) విరాళాలు సేకరించి, మొత్తం రూ. 3,02,850ల నగదును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మందిర కమిటీ సభ్యులు వీరశైవ లింగాయత్ సంఘం రైతులకు మరియు పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తి భావంతో రైతులందరూ ఏకమై ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాంతీశ్వర్ పటేల్, గాండ్ల విఠల్, నితిన్ పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Views: 4
Tags:
About The Author
Latest News
23 Feb 2026 10:08:44
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...

