హనుమాన్ మందిర నిర్మాణానికి రూ. 3.02 లక్షల విరాళం
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి వీరశైవ లింగాయత్ సంఘం తన ఉదారతను చాటుకుంది. శనివారం ఆ సంఘానికి చెందిన రైతులందరూ కలిసి తమ పంట సాగు విస్తీర్ణం ఆధారంగా (ఎకరా చొప్పున) విరాళాలు సేకరించి, మొత్తం రూ. 3,02,850ల నగదును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మందిర కమిటీ సభ్యులు వీరశైవ లింగాయత్ సంఘం రైతులకు మరియు పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తి భావంతో రైతులందరూ ఏకమై ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాంతీశ్వర్ పటేల్, గాండ్ల విఠల్, నితిన్ పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Views: 5
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

