కెనాల్‌లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

కెనాల్‌లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

నిజామాబాద్ జిల్లాఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి హఫీజ్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామ సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద సదరు బాలుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొంత సమయం తర్వాత గ్రామ శివారులో బాలుడి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించడంతో స్థానికులు బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

Views: 4
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం