పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

రూ. 30 వేల నగదు, ఫోన్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

నిజామాబాద్‌ జిల్లాలో జూదగాళ్ల ఆటకట్టించేందుకు పోలీసులు కొరడా ఝుళిపించారు. జిల్లా పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య ఉత్తర్వుల మేరకు, సీసీఎస్ ఇన్‌ఛార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ నేతృత్వంలో పోలీసులు బుధవారం జిల్లావ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఆర్పీక్యాంప్ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతున్నట్లు అందిన సమాచారంతో సీసీఎస్ సిబ్బంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

పోలీసుల రాకను గమనించిన జూదగాళ్లు చెల్లాచెదురుగా పరుగులు తీయగా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ. 30,000 నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, నగదును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎడపల్లి ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, ఇలాంటి స్థావరాలపై నిఘా కొనసాగుతుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.


Views: 16
Tags:

About The Author

Latest News

ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన...
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు
ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
సేవా పథంలో లయన్స్ క్లబ్
తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు
బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
ఇంటర్‌లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని