ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.

ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.

వాజేడు,సెప్టెంబర్ 20,(డిడి9 వార్త):

ములుగు జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటాపురం, పాతపురం గ్రామం నుండి టేకులబోరు గ్రామ శివారు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు వెలిసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్టు 21వ స్థాపన వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కాగర్ తిప్పి కొట్టాలని, పార్టీని బలోపేతం చేయాలని మావోయిస్టులు కరపత్రాల ద్వారా సందేశం ఇచ్చారు.

కరపత్రాలు వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజల్లో భయం నెలకొంది. పోలీసులు అప్రమత్తం అవుతూ, కరపత్రాలు వెలిసిన ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

Views: 76

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు