భద్రతకు రక్షణ కవచం.. సీసీ కెమెరాలు
By R.Suresh
On
జక్రాన్పల్లిలో 25 కెమెరాలు ప్రారంభించిన సీపీ సాయి చైతన్య
సాంకేతికతతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య అన్నారు. 'మన ఊరు-మన భద్రత-మన బాధ్యత' నినాదంతో జక్రాన్పల్లిలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాల అడ్డుకట్టకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగస్వాములై గ్రామాన్ని సురక్షితంగా మార్చిన పంచాయతీ బృందాన్ని కొనియాడారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు, సైబర్ నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీఐ తిరుపతి, ఎస్సై మహేష్, సర్పంచ్ పద్మ సత్యం, విలేకరులు, స్థానికులు పాల్గొన్నారు.
.jpeg)
Views: 0
Tags:
About The Author
Latest News
12 Aug 2026 11:01:00
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్పల్లి గ్రామంలో...

