సీఈఐఆర్ పోర్టల్తో 8 ఫోన్ల రికవరీ
బాధితులకు అందజేసిన భీమ్గల్ పోలీసులు
By R.Suresh
On
భీమ్గల్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న 8 సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను పోలీస్స్టేషన్లో యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన అనంతరం CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ను త్వరితగతిన ట్రేస్ చేసి రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ఫోన్లను సమర్థవంతంగా రికవరీ చేసిన కానిస్టేబుల్ టి. నారాయణను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు.
Views: 3
Tags:
About The Author
Latest News
12 Aug 2026 11:01:00
మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని గ్రామ సర్పంచ్ వన్నెల బాలమని జనార్ధన్ పిలుపునిచ్చారు. బాచన్పల్లి గ్రామంలో...

