హోలీ, రంజాన్ ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్కు వినతి
By R.Suresh
On
రానున్న హోలీ, రంజాన్ పండుగలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మశారత్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కామదహన కూడళ్లు, ఈద్గా మసీదులు మరియు స్మశాన వాటికల వద్ద విద్యుత్ దీపాలు, శానిటేషన్, తాగునీటి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముషీర్ బాబా మోబిన్, గుమ్ముల అశోక్ రెడ్డి, అజార్ మరియు బి. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Views: 12
Tags:
About The Author
Latest News
01 Mar 2026 15:53:05
బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త):
లయన్స్ క్లబ్ అఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బీర్కూర్లోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించిన మహత్తర రక్తదాన శిబిరం ఘనవిజయం సాధించింది. సమాజ...

