పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం

పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం

నిజామాబాద్ జిల్లా  పోతంగల్ మండల కేంద్రంలో శనివారం 14 గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఫోరం అధ్యక్షుడిగా పోతంగల్ సర్పంచ్ సాజి పటేల్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా వివేక్ జలపల్లి (సుంకిని), సెక్రటరీగా ఫెరోజ్ (హంగర్గా ఫారం), క్యాషియర్‌గా సునీల్ (కారేగాం) బాధ్యతలు చేపట్టారు.  సలహాదారులుగా జగన్ (కొల్లూరు), కనకమెడల వాసు (బాకర్ ఫారం), రామ్ రెడ్డి (కల్లూరు), సంజు పటేల్, రాజు (జలపల్లి) నియమితులయ్యారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. మండలంలోని 14 గ్రామాల్లో ఏ సమస్య ఎదురైనా అందరమూ ఒకే యూనిట్‌గా ఉండి, ఐక్యమత్యంతో ముందుకు సాగుతామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మండలంలోని 14 గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు