పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం

పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం

నిజామాబాద్ జిల్లా  పోతంగల్ మండల కేంద్రంలో శనివారం 14 గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఫోరం అధ్యక్షుడిగా పోతంగల్ సర్పంచ్ సాజి పటేల్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా వివేక్ జలపల్లి (సుంకిని), సెక్రటరీగా ఫెరోజ్ (హంగర్గా ఫారం), క్యాషియర్‌గా సునీల్ (కారేగాం) బాధ్యతలు చేపట్టారు.  సలహాదారులుగా జగన్ (కొల్లూరు), కనకమెడల వాసు (బాకర్ ఫారం), రామ్ రెడ్డి (కల్లూరు), సంజు పటేల్, రాజు (జలపల్లి) నియమితులయ్యారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. మండలంలోని 14 గ్రామాల్లో ఏ సమస్య ఎదురైనా అందరమూ ఒకే యూనిట్‌గా ఉండి, ఐక్యమత్యంతో ముందుకు సాగుతామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మండలంలోని 14 గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Views: 10
Tags:

About The Author

Latest News

బీర్కూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ* బీర్కూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ*
బీర్కూర్,మర్చి 02(డిడి9 వార్త): బీర్కూర్ కు చెందిన కొత్తపల్లి గంగామణికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1,00,116 విలువైన చెక్కును...
ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత
బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ
తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్
భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ