ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ దాడులు
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న శివారులో గల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను రెవెన్యూ అధికారులు గురువారం సాలూర శివారులో పట్టుకున్నారు. ఇన్ఛార్జ్ తహశీల్దార్ అనుష తెలిపిన వివరాల ప్రకారం.. మందర్న మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. మందర్న నుంచి ఇసుక లోడుతో వస్తున్న వాహనాలను సాలూర శివారులో అడ్డుకుని తనిఖీ చేయగా, ఎటువంటి అనుమతులు లేవని తేలింది. దీంతో రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.
Views: 7
Tags:
About The Author
Latest News
23 Feb 2026 10:08:44
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...

