ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ దాడులు

ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ దాడులు

నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న శివారులో గల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను రెవెన్యూ అధికారులు గురువారం సాలూర శివారులో పట్టుకున్నారు. ఇన్ఛార్జ్ తహశీల్దార్ అనుష తెలిపిన వివరాల ప్రకారం.. మందర్న మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. మందర్న నుంచి ఇసుక లోడుతో వస్తున్న వాహనాలను సాలూర శివారులో అడ్డుకుని తనిఖీ చేయగా, ఎటువంటి అనుమతులు లేవని తేలింది. దీంతో రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.

 

Views: 7
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం