మహిళా సంఘాలకు 35% సబ్సిడీతో రుణాలు

మహిళా సంఘాలకు 35% సబ్సిడీతో రుణాలు

పిఎం ఎఫ్‌ఎమ్‌ఈ పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు 35 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తున్నట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాచయ్య తెలిపారు. భీంగల్ మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రామ సంఘాల మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గొర్రెలు, మేకలు, కోళ్లు మరియు పాడి గేదెల పెంపకం కోసం రుణాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన మహిళలు బ్యాంకు అధికారులను సంప్రదించి పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల కోసం గ్రామ సంఘాల మహిళలు చేపడుతున్న యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ప్రమీల, సీసీలు కే.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, రఘుపతి, గంగ సాయిలు, భాస్కర్, గంగాధర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు సత్తెమ్మ, ఎంఎస్ ప్రతినిధి సుమలత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-08-24 at 8.42.15 PM (1)

Views: 1
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు