తగిలేపల్లి మాజీ సర్పంచ్‌ హత్య ఘటనపై చట్టపరమైన విచారణ జరపాలి

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఆరోపణలు సరికావు

తగిలేపల్లి మాజీ సర్పంచ్‌ హత్య ఘటనపై చట్టపరమైన విచారణ జరపాలి

​పోచారం భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏసీపీకి ఫిర్యాదు

:వర్ని మండలం ​తగిలేపల్లి మాజీ సర్పంచ్‌ వెంకటేశ్‌ హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డీసీసీబీ మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బుధవారం బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు అందజేశారు. ​ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ... హత్య ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై భాస్కర్‌రెడ్డి అనుచిత విమర్శలు చేస్తూ, దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని ఖండించారు. నిజమైన నిందితులెవరో సమగ్ర విచారణలో తేలాల్సి ఉందన్నారు. సున్నితమైన అంశంలో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న భాస్కర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్‌ఎస్‌ నాయకులు జుబేర్‌, అంజిరెడ్డి, బీర్కూర్‌ సర్పంచ్‌ ధర్మతేజ, తెళ్ల రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

 

Views: 37
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు