కూరగాయలు అమ్ముకునే స్థాయి నుంచి.. మేయర్ పీఠం వరకు : ఇదీ కాంగ్రెస్ మార్క్
By R.Suresh
On
దాదాపు పది సంవత్సరాల నిరీక్షణ తర్వాత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. నిజామాబాద్ పట్టణంతో పాటు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. సాధారణ కూరగాయలు, పండ్లు అమ్ముకునే నేపథ్యం నుంచి వచ్చిన ఉమారాణిని మేయర్గా ఎన్నుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సామాన్యులకే అగ్రతాంబూలం: పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్
"పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్పై నమ్మకం ఉంచారు. ఒక చిన్న స్థాయి నుంచి, కూరగాయలు, పళ్ళు అమ్ముకుని జీవనం సాగించిన ఉమారాణి-రమేష్ కుమార్ దంపతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. సామాన్య కార్యకర్తకు మేయర్ పీఠం దక్కడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం."
అభివృద్ధి కోసమే ఈ కలయిక: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహదారులు సుదర్శన్ రెడ్డి
"మేము ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు, స్వతంత్రంగానే పోరాడాం. కానీ ఎన్నికల తర్వాత పట్టణ అభివృద్ధి ముఖ్యం. నిజామాబాద్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలనే ఉద్దేశంతో మాతో కలిసి వచ్చే వారిని కలుపుకుపోతున్నాం. గత పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. మళ్ళీ అదే స్ఫూర్తితో విద్యా, వైద్య రంగాలను తీర్చిదిద్దుతాం."
మత రాజకీయాలకు చెక్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
"మతాలు, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి పబ్బం గడుపుకునే వారికి నిజామాబాద్ ఓటర్లు గట్టి గుణపాఠం చెప్పారు. కొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా, జిల్లా మొత్తం కాంగ్రెస్ వైపే నిలిచింది. బోధన్, ఆర్మూర్, భీమగల్ మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయడమే దీనికి నిదర్శనం. ఇది ప్రజల విజయం, అభివృద్ధి విజయం."
Views: 14
Tags:
About The Author
Latest News
23 Feb 2026 10:08:44
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...

