అటవీశాఖ సిబ్బందికి నేర పరిశోధనపై శిక్షణ

అటవీశాఖ సిబ్బందికి నేర పరిశోధనపై శిక్షణ

కేసు నమోదు నుంచి నిందితులకు శిక్ష పడే వరకు పక్కా ఆధారాలతో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బందికి నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, కోర్టు విచారణలో ప్రాసిక్యూషన్ అంశాలపై సీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అటవీ నేరాల నియంత్రణలో పోలీస్, అటవీ శాఖల మధ్య పటిష్ట సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టంలోని నిబంధనలు, ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు పాటించాల్సిన పద్ధతులను వివరించారు. నేర స్థలంలో లభించే భౌతిక, డిజిటల్ ఆధారాలను సేకరించి, వాటిని సురక్షితంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపే విధానాలపై అవగాహన కల్పించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో సాక్షులకు సమన్లు, వారెంట్ల అమలు సకాలంలో జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఏసీపీ బి.గురునాయుడు, ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, మల్లేశం, ఎస్ఐ వరప్రసాద్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-08-24 at 8.29.34 PM (1)

Views: 3
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు