​చెస్ ప్రతిభావంతులకు ఘన సన్మానం

​చెస్ ప్రతిభావంతులకు ఘన సన్మానం

జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచిన సాయి సామల చెస్ అకాడమీ విద్యార్థులను బుధవారం బోధన్ పట్టణంలోని ఆర్య సమాజ్‌లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేత​ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ​ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అండర్-17 పోటీల్లో రిష్విక్ బొర్రోల్లా ఛాంపియన్‌గా, గౌరాంగ అశోక్ రన్నరప్‌గా నిలిచారు. అండర్-13 విభాగానికి సంబంధించి గౌరాంగ అశోక్ ఛాంపియన్‌గా నిలవగా... సామల సాయి సుహాస్, మాదయ్య హితేంద్ర, ల్యాడ్లీ బ్రహ్మిణి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ...చదరంగం విద్యార్థుల్లో వ్యూహాత్మక ఆలోచనను, ఏకాగ్రతను పెంపొందిస్తుందన్నారు. విజేతలైన విద్యార్థులతో పాటు అకాడమీకి సెప్టెంబర్ 5న నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. బోధన్ నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కోచ్ సాయిబాబా సామల పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Views: 3
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు