మంజీరా తీరాన పోలీస్ పహారా
By R.Suresh
On
నిజామాబాద్ జిల్లా సాలూర శివారులోని మంజీరా నది తీరంలో బోధన్ రూరల్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం బోధన్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు నదిలో మునిగి మరణించిన విషాద ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. హోలీ పండుగను పురస్కరించుకుని యువకులు పెద్ద సంఖ్యలో స్నానాల కోసం నది వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో, బుధవారం ఇద్దరు కానిస్టేబుళ్లు రోజంతా అక్కడే ఉండి పహారా కాశారు. నది వైపు వెళ్తున్న యువకులను అడ్డుకుని, ప్రమాద తీవ్రతను వివరిస్తూ వారిని వెనక్కి పంపించివేశారు.
Views: 39
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

