ఖిల్లా రామాలయంలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం

స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కవిత దంపతులు

ఖిల్లా రామాలయంలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం

​నేడు మధ్యాహ్నం 3 గంటలకు కవిత కీలక ప్రకటన?

ఇందూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చారిత్రక ఖిల్లా రఘునాథ ఆలయంలో (ఖిల్లా రాంమందిర్) శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె భర్త దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

భక్తి పారవశ్యంలో ఇందూరు

వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణ తంతులో కవిత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆ దేవుడి ఆశీస్సులు అందాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ వేడుకలో జాగృతి రాష్ట్ర, జిల్లా నేతలు అంబాటి శ్రీనివాస్ గౌడ్, కరిపే రాజు, ఇరుమల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయంగా ‘కీలక’ మలుపు?

ఆధ్యాత్మిక వేడుక ఒక ఎత్తైతే, రాజకీయంగా కవిత చేయబోయే ప్రకటన ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తన మెట్టినిల్లయిన నిజామాబాద్ గడ్డ నుంచే కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై జాగృతి వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్

నేడు మధ్యాహ్నం సరిగ్గా 2:30 గంటలకు నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. దీంతో జాగృతి శ్రేణులు, జిల్లా ప్రజలు ఈ కీలక ప్రకటన కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Views: 139
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు