సీపీఎస్ను రద్దు చేసి.. పాత పెన్షన్ను పునరుద్ధరించాలి
నల్ల బ్యాడ్జీలతో TGEJAC నిరసన.. సెప్టెంబరు 10 మహాధర్నాకు పిలుపు
ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎన్జీవోల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. సెప్టెంబరు 1ని పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ... 2004 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్, జమీలుల్లా, ధర్మేందర్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, నాయకులు సతీష్, నాగరాజు, సంజీవయ్య, పద్మ, సునీత, విజయలక్ష్మి, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు..jpeg)

