లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్ కు ఘన సన్మానం
ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శివార్లలో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పాలకమండలి డైరెక్టర్గా నియమితులైన జింక లింగం ను బుధవారం తెలంగాణ లోకల్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జింక లింగం మాట్లాడుతూ... లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్గా నియామకమై స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. పాలకవర్గ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ఆలయ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దౌర్ రత్నాకర్ రెడ్డి, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇరెండ్ల నవీన్, సీనియర్ నాయకులు మైదాం ప్రతాప్ రెడ్డి, రావుట్ల స్వామి గౌడ్, రాజ్ కుమార్, సుధాకర్, చిన్న గంగారాం తదితరులు పాల్గొన్నారు.

