నూతన ఇసుక విధానంపై ట్రాక్టర్ యజమానుల నిరసన

నూతన ఇసుక విధానంపై ట్రాక్టర్ యజమానుల నిరసన

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందర్న గ్రామంలో  ట్రాక్టర్ యజమానులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఇసుక వాహనం విధానం వల్ల స్థానిక వాహన యజమానులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాలూర ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ అనూషను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. నూతన నిబంధనల వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తమ కుటుంబాలు రోడ్డున పడకముందే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్పందించిన తహశీల్దార్ వారి సమస్యలను సావధానంగా విని, ఈ అంశాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సై మచ్చేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఇసుక వాహనం యాప్ పట్ల అవగాహన పెంచుకుని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను యాప్ ద్వారా బుక్కింగ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Views: 31
Tags:

About The Author

Latest News

బీర్కూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ* బీర్కూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ*
బీర్కూర్,మర్చి 02(డిడి9 వార్త): బీర్కూర్ కు చెందిన కొత్తపల్లి గంగామణికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1,00,116 విలువైన చెక్కును...
ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత
బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ
తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్
భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ