నేడు ఏరాజ్ పల్లిలో ఉగాది కుస్తీ పోరు

నేడు ఏరాజ్ పల్లిలో  ఉగాది కుస్తీ పోరు

బోధన్ మండలంలోని ఏరాజ్ పల్లిలో గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ దేవాదాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు గ్రామంలోని కుస్తీ అఖడా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ, ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయని సర్పంచ్ వివరించారు. గ్రామీణ క్రీడలను, మన సంప్రదాయాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మేటి పహిల్వాన్లు ఈ పోటీల్లో తలపడనున్నారని, విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని ఉప సర్పంచ్ పవన్ రెడ్డి తెలిపారు.

ఈ కుస్తీ హంగామాను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామ పాలకవర్గం కోరింది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు వెల్లడించారు.

Views: 47
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు