విచారణ నోటీసులపై ఆందోళన వద్దు: నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్

విచారణ నోటీసులపై ఆందోళన వద్దు: నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జారీ చేస్తున్నవిచారణ నోటీసుల విషయమై ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, అర్బన్ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి దిలీప్ కుమార్ సూచించారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారికి, పేరు, వయస్సు వంటి వివరాల్లో వ్యత్యాసాలున్న వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఎల్‌ఓలు ఇళ్ల వద్దకే వచ్చి నోటీసులు అందిస్తున్నారని, నోటీసు అందుకున్న ఓటర్లు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు హాజరై తగిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు తెలియజేయవచ్చని, విచారణ నోటీసుల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆధారాలు సమర్పిస్తే అర్హులైన వారి పేర్లను ఓటరు జాబితాలో కొనసాగిస్తామని ఆయన వివరించారు.

Views: 2
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు