సాలూరలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన

సాలూరలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన

సాలూర మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక సవరణ ప్రక్రియపై గురువారం గ్రామసభను నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మెహర్ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ద్వారా కొత్త ఓటర్ల నమోదుతో పాటు జాబితాలోని తప్పుల దిద్దుబాటు, సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామస్తులు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు అందజేయాలని కోరారు. అనంతరం బిఎల్‌ఓలు ఓటరు జాబితాలోని సవరణలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోక్కం లావణ్య, రెవెన్యూ సిబ్బంది కళావతి, బూత్ స్థాయి అధికారులు భూమయ్య, సత్య గంగామణి, గోదావరి, మాధవి, సరోజ, శిల్ప, విజయ్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు