ఇనాయత్నగర్లో అందుబాటులోకి ధాన్యం నిల్వ గోదాము
By R.Suresh
On
కమ్మర్పల్లి మండలంలోని ఇనాయత్నగర్ గ్రామంలో ధాన్యం నిల్వ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గోదామును గురువారం సర్పంచ్ బాణావత్ లలితా రాములు, ఉపసర్పంచ్ మకిలి అనిల్ కుమార్ కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన పంటను భద్రపరుచుకోవడానికి ఈ గోదాము ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కచ్చకాయల భూమేష్, వార్డు సభ్యుడు జక్కుల రాజన్న, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఏగుల రాజన్న, వడ్లూరి మోహన్, వెంకటి గంగాధర్, కంచ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 8
Tags:
About The Author
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

