రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
సాలూర చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు 'అరైవ్ అలైవ్'పై బోధన్ రూరల్ పోలీసుల అవగాహన
By R.Suresh
On
రహదారి నిబంధనల పట్ల వాహనదారులు ప్రదర్శించే చిన్నపాటి నిర్లక్ష్యం.. కుటుంబాల్లో తీరని వేదన మిగులుస్తుందని బోధన్ రూరల్ పోలీసులు హెచ్చరించారు. ప్రాణవాయువు ఎంత ముఖ్యమో, ప్రయాణంలో భద్రతా నియమాలు అంతే ముఖ్యమని వారు స్పష్టం చేశారు. శుక్రవారం సాలూర మండల కేంద్రం శివారులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి జందార్ లింగమయ్య మాట్లాడుతూ.. రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని వివరించారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, యజమానులపై చట్టపరమైన చర్యలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దు గుండా వెళ్లే భారీ వాహనదారులు నిబంధనలు పాటిస్తూ, పరిమితికి మించిన వేగంతో వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. నిమిషం అలసత్వం జీవితాంతం విషాదం కాకూడదని పోలీసులు ఈ సందర్భంగా హితవు పలికారు.
Views: 15
Tags:
About The Author
Latest News
02 Mar 2026 15:09:50
బీర్కూర్,మర్చి 02(డిడి9 వార్త): బీర్కూర్ కు చెందిన కొత్తపల్లి గంగామణికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1,00,116 విలువైన చెక్కును...

