​భక్తి పారవశ్యంలో బోధన్.. వైభవంగా జగన్నాథ రథయాత్ర

అచన్‌పల్లి అలివేలు మంగమ్మ గుడి నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు కొనసాగిన రథయాత్ర

​భక్తి పారవశ్యంలో బోధన్.. వైభవంగా జగన్నాథ రథయాత్ర

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. అచన్‌పల్లిలోని శ్రీ అలివేలు మంగమ్మ ఆలయం నుంచి టీటీడీ కల్యాణమండపం వరకు నిర్వహించిన ఈ యాత్ర భక్తి శ్రద్ధల మధ్య కోలాహలంగా సాగింది. ఈ రథయాత్ర మహోత్సవాన్ని బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి దంపతులు పూజలు చేసి ప్రారంభించారు. అచన్‌పల్లి నుంచి ప్రారంభమైన యాత్ర శక్కర్ నగర్, న్యూ బస్స్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు కొనసాగింది. ఇస్కాన్ ప్రతినిధులు అశోక్ నిత్యదాస్, రాధిక మాతాజీ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో భాగంగా ఇస్కాన్ బృందం భక్తులకు సుమారు 1,10,000 కాకినాడ కాజాలను ప్రసాదంగా అందజేశారు. రథయాత్రలో చిన్నారుల కూచిపూడి, భరతనాట్యం, కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హరేకృష్ణ, హరే రామ నామస్మరణతో పట్టణ వీధులు మారుమోగాయి. యాత్ర ముగింపులో భక్తులకు అన్నదాన ప్రసాద పంపిణీ చేశారు.

IMG_20260719_160654

IMG_20260719_160202

IMG_20260719_161646

Views: 17
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు