చందూర్ బీసీ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి

చందూర్ బీసీ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి

చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహ వార్డెన్ కల్పలతపై తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం బోధన్ ఆర్‌డీఓ విజయ కుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీన చందూర్ బీసీ వసతి గృహంలో వార్డెన్ కల్పలత విద్యార్థులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ తీవ్రస్థాయిలో అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. అనవసరంగా నిందలు వేస్తూ దాదాపు 10 మంది విద్యార్థులపై దౌర్జన్యంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులను భయాందోళనలకు గురిచేసిన వార్డెన్‌పై తక్షణమే విచారణ చేపట్టి నిజానిజాలను బయటకు తీసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌ఎఫ్ బోధన్ డివిజన్ నాయకులు పి. గణేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

 

Views: 14
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు