రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిధుల వినియోగంలో వేగం పెంచాలి

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే భూపతి రెడ్డి

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన '99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'ను సర్పంచులు చిత్తశుద్ధితో అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కనీసం 70 శాతాన్ని తక్షణమే వెచ్చించి, మార్చి నెలాఖరులోగా వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో పల్లెల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి గ్రామ స్థాయిలో ఎంతో విశిష్టమైనదని, రాజకీయ వైషమ్యాలను పక్కనబెట్టి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. ముఖ్యంగా మహిళా సర్పంచులు గ్రామ పర్యటనలు చేస్తూ సమస్యలను నేరుగా తెలుసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కులాల వారీగా కాకుండా ఉమ్మడి కమ్యూనిటీ హాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, జడ్పీ సీఈఓ, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

23

Views: 11
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు