సమాజ హితమే మీడియా లక్ష్యం కావాలి : సీపీ పి.సాయిచైతన్య

సమాజ హితమే మీడియా లక్ష్యం కావాలి : సీపీ పి.సాయిచైతన్య

ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది అత్యంత కీలకమైన పాత్రని, సమాజ హితాన్ని కాంక్షిస్తూ వార్తలను ప్రచురించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య అన్నారు. శుక్రవారం నగరంలో డీడీ9 వార్త దినపత్రిక క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజల ముందుంచినప్పుడే మీడియాకు పాఠకుల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగానికి మీడియా సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో, సామాజిక అంశాలపై చైతన్యం తీసుకురావడంలో పత్రికలు కీలక భూమిక పోషించాలని సూచించారు. అనంతరం డీడీ9 వార్త యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తూ.. పత్రిక మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో డీడీ9 వార్త నిజామాబాద్ ఇంచార్జి ఢాకా దుర్గప్రసాద్, బోధన్ డివిజన్ ఇంచార్జి సురేష్, స్వామి పాల్గొన్నారు.
Views: 128
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు