జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు ఏప్రిల్ 30 వరకు పెంపు

జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు ఏప్రిల్ 30 వరకు పెంపు

తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్రిడిటేషన్ నిబంధనలపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మేరకు ముందడుగు వేసింది. జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు, సౌకర్యాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ గడువును పెంచుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించగా, దీనిని రికార్డుల్లోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ నిర్ణయం తాత్కాలిక ఊరట మాత్రమేనని, జర్నలిస్టులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Views: 29
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు