విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలి : సాలూర ఎంఈఓ రాజీ మంజుష

సాలూర జడ్పీ పాఠశాలలో ఘనంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలి : సాలూర ఎంఈఓ రాజీ మంజుష

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, యోగా విన్యాసాలు

విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సాలూర మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజీ మంజుష పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం వైభవంగా జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఎంఈఓ రాజీ మంజుష మాట్లాడుతూ.. విద్యార్థి దశ అనేది జీవితానికి పునాది వంటిదని, ఈ సమయంలో మంచి అలవాట్లు, క్రమశిక్షణ కలిగి ఉంటేనే సమాజంలో గౌరవప్రదమైన స్థానానికి చేరుకుంటారని పేర్కొన్నారు.రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులందరూ శ్రమించి చదివి, వంద శాతం ఫలితాలతో పాఠశాల పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. అంతకుముందు, పాఠశాల విద్యార్థుల గ్రూప్ కమిటీ లీడర్లకు లీడర్ బ్యాడ్జీలు అలంకరించి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, యోగా ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి. ఈ వేడుకలో ఉపాధ్యాయులు విజయ్ కుమార్, శోభారాణి, సుధారాణి, విజయలక్ష్మి, జ్యోత్స్న, అరుణ్ కుమార్, లక్ష్మీ, అబ్బయ్య, స్వామి కాముని, సంగీతరావు, రుద్ర సంతోష్ యాదవ్, విఠల్ కాంబ్లే, గందం సాయిలు, దండు రాజ్ కుమార్, రవి, వనజ, స్వర్ణ పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం, ఉపాధ్యాయులు శశికళ, ఆశ, అపర్ణ, శౌరి రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.
1
Views: 54
Tags:

About The Author

Latest News

ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత
బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త): లయన్స్ క్లబ్ అఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బీర్కూర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించిన మహత్తర రక్తదాన శిబిరం ఘనవిజయం సాధించింది. సమాజ...
బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ
తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్
భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం