అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి

గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు సకాలంలో అందాలని, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధిని పరుగులు పెట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 

శుక్రవారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్, కందకుర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

చేపట్టిన ప్రతి పనిని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న కందకుర్తి వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగంతో పాటు భక్తి సంబంధిత సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Views: 14
Tags:

About The Author

Latest News

ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత
బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త): లయన్స్ క్లబ్ అఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బీర్కూర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించిన మహత్తర రక్తదాన శిబిరం ఘనవిజయం సాధించింది. సమాజ...
బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ
తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్
భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం