అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి : ఎంపీడీఓ బి.నర్సయ్య

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి : ఎంపీడీఓ బి.నర్సయ్య

ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని మండల పరిషత్ అభివృద్ధి  అధికారి బి.నర్సయ్య ఆదేశించారు. సోమవారం సాలూర రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.  ప్రజల నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించి 2, నీటిపారుదల శాఖకు 1 దరఖాస్తు చొప్పున మొత్తం మూడు వినతులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ  కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Views: 29
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు