ఆలయాల వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి

ఆలయాల వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి

ఈ నెల 17న జరగనున్న నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా మౌలిక వసతులు కల్పించాలని బోధన్ పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బోధన్ తహసీల్దార్ విట్టల్, మున్సిపల్ కమిషనర్‌ జాదవ్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. బోధన్ పట్టణంలోని ఏకచక్రనగర్ కాలనీలో వెలసిన శ్రీ సంతాన నాగమ్మ, శ్రీ శివ బసవేశ్వర ఆలయాల వద్ద శ్రావణమాస నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. పండుగ రోజున పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, ఆడపడుచులు, చిన్నారులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా ఆలయ ప్రాంగణమంతా బురదమయంగా మారిందని, భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆలయ పరిసరాల్లో మొరం వేసి నేలను చదును చేయాలని, భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. పండుగకు ముందే అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.


Views: 12
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు