తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్గా కర్పే రాజు
By R.Suresh
On
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్గా కర్పే రాజు నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరగగా, తాజాగా బాధ్యతలు స్వీకరించిన రాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జిల్లా ఉద్యమకారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Views: 42
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

