నిజామాబాద్ లో ఘనంగా కవిత పుట్టినరోజు వేడుకలు
By R.Suresh
On
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు మాట్లాడుతూ.. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కవిత చేస్తున్న కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అడక్ కమిటీ సభ్యులు అంబటి శ్రీనివాస్ గౌడ్, ఇరుముల శంకర్, తెలంగాణ శంకర్, దొంతు ప్రవీణ్, హన్మాండ్లు, సంతోష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Views: 87
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

