ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ : ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ : ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా

సోదరభావానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా ఉంటామని సోదరులు భరోసానివ్వడమే ఈ పండుగ విశిష్టత అని పేర్కొన్నారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని, మహిళలకు భద్రత, గౌరవం అందించాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని, ప్రేమానురాగాలను చాటే ఈ పర్వదినం మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతుందన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రజల మధ్య ఆత్మీయతను మరింత పెంపొందించాలని వారు కోరారు.

IMG-20260827-WA0085

 

Views: 0
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు