సాలూర మండల వీరశైవ లింగాయత్ సమాజ్ నూతన కమిటీ ఎన్నిక
మండల కేంద్రమైన సాలూరలో వీరశైవ లింగాయత్ సమాజ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం నిర్వహించిన సమాజ సర్వసభ్య సమావేశంలో కుల బాంధవులందరి సమక్షంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం అధ్యక్షుడిగా ములీగే జై రామ్ పటేల్, ఉపాధ్యక్షుడిగా ఎన్నె గణపతి, కార్యదర్శిగా మాండే భీమ్ రావు, కోశాధికారిగా ఓల్లంకి అనిల్ బాధ్యతలు చేపట్టారు. సంఘం బలోపేతానికి, భవిష్యత్తు కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే సలహాదారులుగా చేన్నప్ప విజయ్ పటేల్, దడెన్ శంకర్, భుయ్యన్ శివరాజ్, బండే గంగాధర్, జున్నే సంజులను నియమించారు.
పాత కమిటీ సభ్యులకు ఘన సన్మానం : ఈ సందర్భంగా గత మూడేళ్లుగా సంఘం అభివృద్ధికి, కుల బాంధవుల ఐక్యతకు విశేష కృషి చేసిన పాత కమిటీ సభ్యులను నూతన కార్యవర్గం ఘనంగా సన్మానించింది. వారి సేవలను కొనియాడుతూ శాలువాలు కప్పిగౌరవించారు. అనంతరం నూతన అధ్యక్షులు ములీగే జై రామ్ పటేల్ మాట్లాడుతూ.. గత కమిటీ అందించిన స్ఫూర్తితో, పెద్దల సలహాలు పాటిస్తూ సమాజ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కుల బాంధవుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

